ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: మాజీ మంత్రి పీతల సుజాత నేతృత్వంలో యువనేతల బృందం దుబాయ్కు పయనం
ABN , First Publish Date - 2022-06-11T02:22:30+05:30 IST
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఆన్న NTR శత జయంతి ఉత్సవాలను ఈ ఏడాదంతా నిర్వహించాలని ఎన్నారై టీడీపీ శాఖలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో..
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఆన్న NTR శత జయంతి ఉత్సవాలను ఈ ఏడాదంతా నిర్వహించాలని ఎన్నారై టీడీపీ శాఖలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. దుబాయ్లో జరగబోయే శతజయంతి ఉత్సవాలు, మహానాడులో పాల్గొనేందుకు మాజీ మంత్రి పీతల సుజాత నేతృత్వంలో యువనేతల బృందం బయలుదేరింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ, కార్యనిరాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.