సికింద్రాబాద్ ఘటన.. అధికార పార్టీ డబ్బులిచ్చి చేయించిందే: Raghunandan rao

ABN , First Publish Date - 2022-06-20T19:25:36+05:30 IST

గత రెండు మూడు రోజులుగా భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ప్రతిపక్షాలు, ఈ రాష్ట్ర పాలక పక్షం ప్రవర్తించిన తీరు బాధకారమని ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు.

సికింద్రాబాద్ ఘటన.. అధికార పార్టీ డబ్బులిచ్చి చేయించిందే: Raghunandan rao

నల్గొండ: గత రెండు మూడు రోజులుగా భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ప్రతిపక్షాలు, ఈ రాష్ట్ర పాలక పక్షం ప్రవర్తించిన తీరు బాధకారమని ఎమ్మెల్యే రఘనందన్ రావు(Raghunandan rao) అన్నారు. పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీల, కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే  పాల్గొని ప్రసంగించారు.  ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల పర్యటనలలో ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్న పోలీసులు... రైల్వే స్టేషన్‌లో రోజంతా  విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ డబ్బులిచ్చి కావాలని చేయించిందే ఈ ఘటన అని ఆరోపించారు. ఈ దేశానికి సేవ చేయాలినుకునే అభ్యర్థులు ఇతరుల మాట విని తప్పుదోవ పట్టవద్దని సూచించారు. ఎంతోమంది మేధావుల ఆలోచనలు, సమీక్షల తరువాతే తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్ అని చెప్పుకొచ్చారు. జులై 2,3 న హైదరాబాద్‌లో జరిగే ప్రధాని సభకు జిల్లాకు లక్షమంది చొప్పున తరలించడానికి జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-20T19:25:36+05:30 IST