వర్చువల్ ప్రసంగానికే ప్రధాని పరిమితం.. బిజనౌర్ పర్యటన రద్దు

ABN , First Publish Date - 2022-02-07T17:55:11+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం..

వర్చువల్ ప్రసంగానికే ప్రధాని పరిమితం.. బిజనౌర్ పర్యటన రద్దు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వర్చువల్‌ ప్రసంగం ద్వారా యూపీ ప్రజలతో మాట్లాడనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని బిజనౌర్ వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన జన్ చౌపల్ ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే, వాతావరణ కారణాల రీత్యా ఆయన పర్యటన రద్దయింది. దీంతో వర్చువల్ మీట్‌ ద్వారా ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.


Updated Date - 2022-02-07T17:55:11+05:30 IST