Road accident: కారుపై డంపర్ బోల్తా...ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2022-07-20T14:16:44+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది....

Road accident: కారుపై డంపర్ బోల్తా...ఐదుగురి మృతి

రాయ్‌బరేలీ(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. రాయ్‌బరేలీలో (Raebareli) నడుస్తున్న కారుపై (car) డంపర్ బోల్తా పడిన(dumper overturned) దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. రాయ్‌బరేలీ జిల్లాలో ఫ్లై యాష్‌తో నింపిన డంపర్ కారుపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు నలిగి మరణించారు.రాయ్‌బరేలీ జిల్లాలో మంగళవారం రాత్రి కారుపై ఫ్లై యాష్ నింపిన డంపర్ బోల్తా పడటంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు వ్యక్తులు చనిపోయారు.ఈ సంఘటన భాదోఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌బరేలీ-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారి 30పై జరిగింది.డంపరులో ఫ్లై యాష్ అధికంగా ఉండడంతో కారును ఓవర్ టేక్ చేస్తుండగా డంపర్ బోల్తా పడింది. 


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డంపర్‌ కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే వారిని సకాలంలో రక్షించలేకపోయారు.మృతులను రాకేష్ అగర్వాల్ (45), సోనమ్ అగర్వాల్ (35), రుచిక అగర్వాల్ (35), ఇద్దరు పిల్లలు రైసా (9), ర్యాన్ (6)గా గుర్తించారు. మరో 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కుటుంబ సమేతంగా రెస్టారెంట్ లో రాత్రి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారి మృతదేహాలను జేసీబీ సాయంతో శిథిలాల నుంచి బయటకు తీశారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నచిన్నారి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారని రాయ్‌బరేలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్ చెప్పారు.


Updated Date - 2022-07-20T14:16:44+05:30 IST