పట్టణంలో కొనసాగుతున్న దుర్గా నవరాత్రులు
ABN , First Publish Date - 2022-09-30T06:07:21+05:30 IST
నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో గురువారం దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు.
నిర్మల్ కల్చరల్, సెప్టెంబరు 29 : నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో గురువారం దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు మెంగాశేఖర్ ఆధ్వర్యంలో ప్రతీరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకపూజలు జరుపుతు న్నారు. కాలనీవాసులు అధికసంఖ్యలో హాజరవుతున్నారు. చిన్నారుల ప్రదర్శించిన నృత్యాలు చూపరులను అలరించాయి.