ఇంద్రకీలాద్రిపై ఘనంగా మహాలక్ష్మీ యాగం

ABN , First Publish Date - 2020-11-14T06:54:49+05:30 IST

ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం దుర్గగుడిలోని యాగశాలలో మహాలక్ష్మీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై ఘనంగా మహాలక్ష్మీ యాగం
లక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ ఉత్సవమూర్తి

నేటి సాయంత్రం ఆలయం మూసివేత 

విజయవాడ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం  దుర్గగుడిలోని యాగశాలలో మహాలక్ష్మీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో ఈవో ఎంవీ సురేష్‌బాబు, ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో సాయంత్రం 5 గంటలకు ధనలక్ష్మీ పూజ, 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం 7 గంటలకు ప్రధాన ఆలయం, ఉపాలయాల తలుపులు మూసివేస్తారు. తిరిగి 15వ తేదీ ఉదయం అమ్మవారి దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.







Updated Date - 2020-11-14T06:54:49+05:30 IST