Prasad sharma: భవానీ దీక్షాధారులు దర్శనాలకు మాత్రమే రావాలి

ABN , First Publish Date - 2022-09-29T19:44:37+05:30 IST

దుర్గుగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భవానీ దీక్షాధారులు కేవలం అమ్మవారి దర్శనాలకు మాత్రమే రావాలని దుర్గగుడి ఆలయ స్థానాచార్యులు విష్ముభట్ల శావప్రసాద శర్మ అన్నారు.

Prasad sharma: భవానీ దీక్షాధారులు దర్శనాలకు మాత్రమే రావాలి

విజయవాడ: దుర్గుగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భవానీ దీక్షాధారులు కేవలం అమ్మవారి దర్శనాలకు మాత్రమే రావాలని  దుర్గగుడి ఆలయ స్థానాచార్యులు విష్ముభట్ల శావప్రసాద శర్మ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో ఇరుముడి సమర్పణ, హోమగుండాలను ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. దీక్షా ధారులు వారి స్వస్థలాల్లోనే గురుభవానీల చేతుల మీదుగా దీక్షల విరమణలు చేసుకోవాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసంలో భవానీ దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. 41 రోజుల తర్వాత దీక్ష విరమణలకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఇందుకు భవానీ భక్తులు దేవస్థానానికి సహకరించాలని ప్రసాద శర్మ కోరారు. 


Updated Date - 2022-09-29T19:44:37+05:30 IST