Durgaprasad: ఆ బాలుడి అవయవాలు సజీవం...
ABN , First Publish Date - 2022-09-30T15:32:58+05:30 IST
బ్రెయిన్డెడ్ అయిన 7వ తరగతి విద్యార్థి అవయవాలు దానం చేయడంతో పలువురు పునర్జన్మ పొందనున్నారు. వేలూరు జిల్లా చిన్నపల్లికుప్పంకు
వేలూరు(చెన్నై), సెప్టెంబరు 29: బ్రెయిన్డెడ్ అయిన 7వ తరగతి విద్యార్థి అవయవాలు దానం చేయడంతో పలువురు పునర్జన్మ పొందనున్నారు. వేలూరు జిల్లా చిన్నపల్లికుప్పంకు చెందిన టైలర్ సతీష్ -నందిని కుమారుడు దుర్గాప్రసాద్ (13) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. దుర్గాప్రసాద్ ఈ నెల 25న సైకిల్ మీద పాక్కం ప్రాంతంలోని ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గాప్రసాద్ గురువారం ఉదయం బ్రెయిన్డెడ్ అయ్యాడు. వైద్యుల సలహాతో బాలుడి అవయవాలు దానం అందజేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో, శస్త్రచికిత్స ద్వారా అవయవాలు తీసిన వైద్యులు, పేగులు, ఒక కిడ్నీ చెన్నై ఆస్పత్రికి, మరో కిడ్నీ చెన్నై రామచంద్ర ఆసుపత్రి(Ramachandra Hospital)కి తరలించారు. వేలూరు నుంచి చెన్నైకి 145 కి.మీ ఉండడంతో అవయవాలు తీసుకెళ్లే రెండు అంబులెన్స్లు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గంట 20 నిమిషాల్లో చెన్నై చేరుకున్నాయి.