Quarantine Hotel నుంచి పారిపోతున్న జంట అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-29T13:21:24+05:30 IST

దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చిన కొవిడ్ పాజిటివ్ జంట హోటల్ క్వారంటైన్ నుంచి పారిపోతుండగా డచ్ పోలీసులు అరెస్ట్ చేశారు...

Quarantine Hotel నుంచి పారిపోతున్న జంట అరెస్ట్

హేగ్ (నెదర్లాండ్స్): దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చిన కొవిడ్ పాజిటివ్ జంట హోటల్ క్వారంటైన్ నుంచి పారిపోతుండగా డచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొవిడ్ పాజిటివ్ ప్రయాణికులు బస చేసిన క్వారంటైన్ హోటల్ నుంచి ఓ జంట పారిపోయి  విమానం ఎక్కగా వారిని అరెస్టు చేసినట్లు డచ్ సరిహద్దు పోలీసులు తెలిపారు.శుక్రవారం ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయానికి రెండు విమానాల్లో వచ్చిన ప్రయాణికుల్లో 61 మందికి కరోనావైరస్ సోకింది. వారిలో 13 మంది కొత్త ఓమైక్రాన్ వేరియంట్‌ కరోనాతో బాధపడుతున్నారని డచ్ అధికారులు చెప్పారు. జంటలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. మరోకరికి కరోనా సోకకున్నా హోటల్ లో క్వారంటైన్ కు తరలించారు. 


ఈ జంట స్పానిష్ దేశానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి, 28 ఏళ్ల పోర్చుగీస్ మహిళ క్వారంటైన్ హోటల్ నుంచి పారిపోతుండగా పట్టుకున్నామని పబ్లిక్ హెల్త్ అథారిటీ ప్రతినిధి స్టెఫానీ వాన్ వార్డెన్‌బర్గ్ చెప్పారు. పారిపోతున్న జంట టేకాఫ్ అవుతున్న విమానం ఎక్కారని అంతలోనే వారిని అరెస్టు చేశామని వార్డెన్ బర్గ్ తెలిపారు. కరోనా కొత్త ఓమైక్రాన్ వేరియెంట్ ప్రబలుతున్న తరుణంలో ప్రజల భద్రతకు భంగం కలిగించినందుకు డచ్ బోర్డర్ పోలీసులు ఇప్పుడు జంటపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో అభియోగాలు మోపారు.ఈ జంట హోటల్ నుంచి ఎలా తప్పించుకుంది తెలియలేదు.ఈ జంట క్వారంటైన్ నుంచి పారిపోయిన ఘటన తర్వాత తాము క్వారంటైన్ హోటల్ వద్ద సెక్యూరిటీ గార్డులను కాపలాగా పెట్టామని స్థానిక మేయరు చెప్పారు.


Updated Date - 2021-11-29T13:21:24+05:30 IST