ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది: దుట్టా రామచంద్ర రావు

ABN , First Publish Date - 2022-06-12T20:21:52+05:30 IST

కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందరని వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు తెలిపారు. తనకు ఎంపీ సీటు

ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది: దుట్టా రామచంద్ర రావు

కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు తెలిపారు. తనకు ఎంపీ సీటు కావాలా? లేక ఎమ్మెల్యే సీటు కావాలా?  అని జగన్ అడిగారని చెప్పారు. వంశీకి టిక్కెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని.. కానీ పార్టీలోనే ఉంటానని సీఎంకు తెలిపానని దుట్టా చెప్పారు. తాను ఇప్పటివరకూ చంద్రబాబు‌ను నేరుగా చూడలేదన్నారు. టీడీపీ వారితో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

Updated Date - 2022-06-12T20:21:52+05:30 IST