పోలీసుల అదుపులో డ్వాక్రా యానిమేటర్‌ ?

ABN , First Publish Date - 2022-01-21T05:06:23+05:30 IST

మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళా యానిమేటర్‌ అనసూయమ్మ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అనసూయమ్మ ఆ గ్రామంలోని 15 డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల డబ్బు రూ.17,25,000 ఏడాదిన్నర క్రితం స్వాహా చేసింది.

పోలీసుల అదుపులో డ్వాక్రా యానిమేటర్‌ ?

చాపాడు, జనవరి 20: మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళా యానిమేటర్‌ అనసూయమ్మ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అనసూయమ్మ ఆ గ్రామంలోని 15 డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల డబ్బు రూ.17,25,000 ఏడాదిన్నర క్రితం స్వాహా చేసింది. ఆమె తిరిగి సభ్యులకుగానీ, బ్యాంకులో కానీ చెల్లించకుండా గ్రామం వదిలి వెళ్లిపోయారు. దీనిపై రెండు నెలల క్రితం వెలుగు ఏపీఎం వెంకటరమణ డబ్బు రికవరీ చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని సమాచారం.


Updated Date - 2022-01-21T05:06:23+05:30 IST