ఎమ్మెల్యే సమావేశానికి డ్వాక్రా మహిళలు హాజరు కావాల్సిందే: వెలుగు ఏపీఎం
ABN , First Publish Date - 2022-04-28T22:26:35+05:30 IST
ఎమ్మెల్యే సమావేశానికి డ్వాక్రా మహిళలు హాజరు కావాలని
తిరుపతి: ఎమ్మెల్యే సమావేశానికి డ్వాక్రా మహిళలు హాజరు కావాలని వెలుగు ఏపీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిర్వహించే సమావేశానికి డ్వాక్రా మహిళలు హాజరు కావాలంటూ వెలుగు ఏపీఎం హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సమావేశానికి రాకపోతే సంక్షేమ పథకాలు రావని ఆడియోలో మహిళలను బెదిరించారు. వెలుగు ఏపీఎం సరిత ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆదేశాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.