విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించం
ABN , First Publish Date - 2021-02-27T03:35:24+05:30 IST
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది విఽధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డ్వామా పీడీ తిరుపతయ్య హెచ్చరించారు.
డ్వామా పీడీ తిరుపతయ్య
వింజమూరు(ఉదయగిరి రూరల్), ఫిబ్రవరి 26: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది విఽధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డ్వామా పీడీ తిరుపతయ్య హెచ్చరించారు. శుక్రవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో నియోజకవర్గస్థాయిలో ఉపాధి సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల సంఖ్య పెంచడంతోపాటు ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కూలీల పిల్లలకు ఉన్నతి పథకం కింద 90 రోజులపాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ పథకంపై కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మాసం మండలస్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలను అధిగమించని సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ విజయకుమార్, ఎంపీడీవో కనకదుర్గాభవానీ, ఏపీవోలు ఎంవీ సుభాషిణి, నాగరాజు, భానునాయక్, శ్రీనివాసులు, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.