శ్రీవారి క్షేత్రం..కళకళ

ABN , First Publish Date - 2022-05-22T05:54:41+05:30 IST

శ్రీవారి క్షేత్రం..కళకళ

శ్రీవారి క్షేత్రం..కళకళ
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులు

ద్వారకాతిరుమల, మే 21: స్వయం భువమూర్తిగా శేషాచలకొండపై శ్రీవారు వెలసిన ద్వారకాతిరుమల క్షేత్రం శని వారం భక్తులతో కళకళలాడింది. అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రికే పలువురు భక్తులు పాదయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. క్షేత్రపరిసరాలు సందడిగా మారాయి. దాదాపు 15,000మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తు న్నారు. శ్రీవారి దర్శనానికి 4గంటల పైబడి సమయం పట్టింది. దర్శనానంతరం వారం తా శ్రీవారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరి ంచారు.


Updated Date - 2022-05-22T05:54:41+05:30 IST