కాకినాడకు పట్టిన అవినీతి చీడపురుగు ద్వారంపూడి: పట్టాభి

ABN , First Publish Date - 2022-02-19T22:27:59+05:30 IST

ఎమ్మెల్యే ద్వారంపూడ చంద్రశేఖర్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ‘‘కాకినాడకి పట్టిన అవినీతి చీడపురుగు ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడకు పట్టిన అవినీతి చీడపురుగు ద్వారంపూడి: పట్టాభి

అమరావతి: ఎమ్మెల్యే ద్వారంపూడ చంద్రశేఖర్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ‘‘కాకినాడకి పట్టిన అవినీతి చీడపురుగు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. మంత్రితో కలిసి  పేదల బియ్యాన్ని ద్వారంపూడి దోచుకుంటున్నారు. నిజాలు బయటపెట్టిన వారిని బూతులు తిడతారా?. కాకినాడని అవినీతికి అడ్డాగా మార్చారు. లెక్కలు తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడే.. ద్వారంపూడి బాగోతాన్నే బయటపెట్టాను. 2018-19లో 18.09 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అయ్యాయి. 2020-21లో 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. బియ్యం ఎగుమతులు ఎలా పెరిగాయో ద్వారంపూడి సమాధానం చెప్పాలి?.. టీడీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కట్టుకథలు చెబుతున్నారు. ద్వారంపూడి ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. బియ్యం అక్రమ ఎగుమతులపై సీబీఐ విచారణ జరిపించాలి’’ అని పట్టాభి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-19T22:27:59+05:30 IST