ఈ పంట నమోదుపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-07-24T06:43:22+05:30 IST

ఈ పంట నమోదుపై అవగాహన అవసరం

ఈ పంట నమోదుపై అవగాహన అవసరం
అధికారులతో మాట్లాడుతున్న జేసీ మాధవీలత

జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత

కంకిపాడు, జూలై 23 : ప్రతి రైతు తమ పంటను  ఈ నమోదు చేయించుకునే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత అన్నారు. మండలంలోని ఉప్పలూరు, పునాదిపాడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి ఈ పంట నమోదు  సరళీకృతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైతు తమ పంటను తప్పని సరిగా ఈ పంట నమోదు చేయించుకునే విధంగా  రెవెన్యూ,  వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ టి.వి.సతీష్‌, ఎంపీడీవో కొడాలి అనురాధ, ఏవో  కిరణ్‌, ఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఎరువుల ధర పట్టిక పోస్టర్‌ ఆవిష్కరణ

పెనమలూరు : ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్న ఎరువులు, ప్రైవేటు షాపుల్లో విక్రయిస్తున్న ఎరువుల ధరల పట్టికను పోస్టర్‌ రూపంలో ముద్రించి వ్యవసాయ శాఖ అధికారులు ఆవిష్కరించారు. శుక్రవారం పోరంకిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సునీల్‌ ధరల పట్టికను ఆవిష్కరించారు. సమావేశంలో కమిటీ చైర్‌ పర్సన్‌ గుంటూరు శ్రీనివాస చౌదరి, సభ్యులు కొడాలి శ్రీధర్‌, కం బాల ఆదిశేషు, పోలవరపు రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:43:22+05:30 IST