చంద్రబాబు పాలన అవసరం

ABN , First Publish Date - 2022-05-25T06:17:47+05:30 IST

రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు పాలన అవసరం అని, పార్టీ శ్రేణులు చంద్రబాబే ముఖ్యమంత్రి అనే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ పిలుపునిచ్చారు.

చంద్రబాబు పాలన అవసరం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌

చంద్రబాబు పాలన అవసరం

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌

పటమట, మే 24 : రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు పాలన అవసరం అని, పార్టీ శ్రేణులు చంద్రబాబే ముఖ్యమంత్రి అనే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం అశోక్‌నగర్‌లోని తూర్పు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌ అధ్యక్షతన నియోజకవర్గ క్లస్టర్స్‌ ఇన్‌చార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావులు పాల్గొని క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్న వైసీపీని పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు చంద్రబాబు క్లస్టర్స్‌ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు ఓటర్‌ వెరిఫికేషన్‌ చేయించాలన్నారు. ఈ విధానం వలన రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సులభంగా ఎన్నికలను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ అందరూ సమష్టిగా పని చేసి రాష్ట్రంలో తెలుగుదేశం జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గోనుగుల కోటేశ్వరరావు మాట్లాడుతూ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు, బూత్‌ ఇన్‌చార్జ్‌లు ప్రతిరోజు రెండు గంటల పాటు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్‌, ఎస్‌.ఫిరోజ్‌, పొట్లూరి సాయిబాబు, చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T06:17:47+05:30 IST