లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు...డ్రైవర్ మృతి

ABN , First Publish Date - 2022-05-30T13:37:37+05:30 IST

తూర్పుగోదావరిలోని దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు...డ్రైవర్ మృతి

తూర్పుగోదావరి: తూర్పుగోదావరిలోని దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-30T13:37:37+05:30 IST