అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనాలు బంద్
ABN , First Publish Date - 2021-12-02T18:10:12+05:30 IST
తూర్పుగోదారవరి జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనాలు నిలిచిపోయాయి.
కాకినాడ: తూర్పుగోదారవరి జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఏరియా ఆసుపత్రిలో భోజనాలను నిలుపుదల చేశారు. నెలల తరబడి కాంట్రాక్టరుకు బిల్లులు అందడం లేదు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. భోజనాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.12 లక్షల మేర బిల్లు పెండింగ్లో ఉండడంతో ముందస్తుగా సూపరింటెండెంట్కు కాంట్రాక్టర్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది.