తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్ల అనాసక్తి
ABN , First Publish Date - 2021-12-07T18:39:40+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్ల అనాసక్తి చూపుతున్నారు.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్లు అనాసక్తి చూపుతున్నారు. రూ.200 కోట్ల పాత బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్తపనులు చేస్తామని తేల్చిచెప్పారు. 4 సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి. దీంతో రోడ్డుభవనాల శాఖ అధికారులు మరోసారి గడువు పెంచారు. 457 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం రూ.119 కోట్లు, 159 కిలోమీటర్లకు రూ.79 కోట్లతో ఐదోసారి టెండర్లకు అధికారులు ఆహ్వానం పంపారు.