Rajahmundry: లారీని దోచుకునేందుకు దుండగుల కాల్పులు

ABN , First Publish Date - 2022-02-20T14:50:02+05:30 IST

లారీని దోచుకునేందుకు దుండగుల ఏకండా కాల్పులకు తెగబడ్డారు.

Rajahmundry: లారీని దోచుకునేందుకు దుండగుల కాల్పులు

రాజమండ్రి: లారీని దోచుకునేందుకు దుండగుల ఏకండా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండ‌లం చేబ్రోలు స‌మీపంలో జరిగింది. సిమెంట్‌ లోడుతో యలమంచిలి నుంచి అమలాపురం వెళుతున్న లారీని దుండగులు అడ్డగించారు. కాగా డ్రైవర్ లారీని ఆపకపోవడంతో రెచ్చిపోయిన దుండగులు లారీపై కాల్పులు జరిపారు. లారీ సైడ్ మిర్రర్‌ నుంచి బుల్లెట్‌  దూసుకుపోయింది. అద్దాలు ప‌గ‌లి లారీ డ్రైవర్‌ దీప‌క్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Updated Date - 2022-02-20T14:50:02+05:30 IST