తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం : కలెక్టర్
ABN , First Publish Date - 2022-08-09T07:03:42+05:30 IST
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 8 : తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాలు లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. కాన్పు తర్వాత మొదటి
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 8 : తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాలు లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. కాన్పు తర్వాత మొదటి రెండు మూడ్రోజుల్లో వచ్చే ముర్రుపాలు బిడ్డ ఆరోగ్యానికి తొలి టీకా వంటిదన్నారు. అనంతరం 20 మంది గర్భిణీలకు కలెక్టర్ సీమంతాలు చేశారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి, సాధికారిత అధికారిణి కె .విజయకుమారి, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ వసుంధర, డీసీహెచ్ఎస్ డాక్టర్ సనత్కుమారి, డీఐవో జ్యోతి, సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.