ఈ చేప ధర రూ. 20వేలు

ABN , First Publish Date - 2021-08-17T17:16:44+05:30 IST

యానాంలో భారీ పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ పులస చేప చాలా...

ఈ చేప ధర రూ. 20వేలు

తూ.గో.జిల్లా: యానాంలో అరుదైన పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ పులస చేప చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ అరుదైన పులస చేప చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. దాని బరువు రెండు కిలోలకుపైగా ఉందని, దీని ధర రూ. 20 వేలని, యానాం చరిత్రలో ఇది అత్యధికమన్నారు.


ఇటీవల కాలంలో గోదావరిలో ఇలాంటి పులస చేపల జాడ కనిపించడంలేదని మత్స్యకారులు చెప్పారు. కొద్ది రోజుల క్రితం దొరికిన ఈ పులస చేపకు రూ. 17వేల ధర పలికింది. కానీ ఇప్పుడు దొరికిన పులస చేపకు మార్కెట్‌లో రూ. 20ల ధర పలికింది.

Updated Date - 2021-08-17T17:16:44+05:30 IST