పిఠాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహా ధర్నా

ABN , First Publish Date - 2022-03-17T17:46:24+05:30 IST

పిఠాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహా ధర్నా చేపట్టారు.

పిఠాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహా ధర్నా

తూ.గో. జిల్లా: పిఠాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహా ధర్నా చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ జాబ్‌లు ఇచ్చి.. ఉద్యోగులు ఇచ్చామంటూ సీఎం జగన్ ప్రచారం చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచి సీఎం జగన్ నిరుద్యోగుల పొట్ట కొట్టారని ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించే వరకు టీడీపీ ఆందోళన కొనసాగిస్తుందని వర్మ హెచ్చరించారు.

Updated Date - 2022-03-17T17:46:24+05:30 IST