తూర్పుకాపుల సంక్షేమానికి కృషి చేస్తా
ABN , First Publish Date - 2020-11-27T05:51:42+05:30 IST
తూర్పుకాపు సంక్షేమానికి అన్నివిధాలా కృషిచేస్తానని ఆ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. గురువారం స్థానిక తులసి కల్యాణమండపం వద్ద జరిగిన మాడుగుల నియోజకవర్గ తూర్పుకాపు కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్
మాడుగుల/మాడుగుల రూరల్, నవంబరు 26: తూర్పుకాపు సంక్షేమానికి అన్నివిధాలా కృషిచేస్తానని ఆ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. గురువారం స్థానిక తులసి కల్యాణమండపం వద్ద జరిగిన మాడుగుల నియోజకవర్గ తూర్పుకాపు కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యఅతిథులుగా హాజరైన తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్, డైరెక్టర్ ప్రభావతి, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడులను సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్తీక వన సమారాధనకు నియోజకవర్గ కాపు సంఘ నాయకులతోపాటు ఉత్తరాంధ్ర నాయకులు కూడా హాజరయ్యారు. అంతకుముందు మాడుగుల మోదకొండమ్మను రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి సత్కరించారు.