వెంటిలేటర్ల కొరత తీర్చే ‘ఈబాస్‌’

ABN , First Publish Date - 2020-07-07T07:56:51+05:30 IST

కరోనా సంక్షోభంతో వెంటిలేటర్ల కొరత నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేరళలోని శ్రీచిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడే వారికి మెకానికల్‌ వెంటిలేటర్‌ను అమర్చే వరకు...

వెంటిలేటర్ల కొరత తీర్చే ‘ఈబాస్‌’

తిరువనంతపురం, జూలై 6 : కరోనా సంక్షోభంతో వెంటిలేటర్ల కొరత నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేరళలోని శ్రీచిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడే వారికి మెకానికల్‌ వెంటిలేటర్‌ను అమర్చే వరకు.. తాత్కాలిక ఉపశమనాన్ని అందించగలిగే ‘అత్యవసర శ్వాస సహాయక వ్యవస్థ’(ఈబీఏఎ్‌స)ను అభివృద్ధిచేసింది. దీనికి ‘ఎయిర్‌ బ్రిడ్జ్‌’ అని పేరు పెట్టారు. శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌, విప్రో 3డీల సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ పరికరాన్ని మంగళవారం(జూలై 7న) వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. బ్యాటరీతో నడిచే ఈబీఏఎస్‌ నిర్వహణ వ్యయం చాలా తక్కువ. వైద్య నిపుణుల సహకారం లేకుండానే దీన్ని ఎవరైనా సులభంగా వాడొచ్చు. మాల్స్‌, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలోనూ దీన్ని ఏర్పాటుచేసే వీలుంటుంది.


Updated Date - 2020-07-07T07:56:51+05:30 IST