ఇచ్చేది గోరంత.. వడ్డింపు కొండంత

ABN , First Publish Date - 2022-07-02T06:37:17+05:30 IST

ఇచ్చేది గోరంత.. వడ్డింపు కొండంత

ఇచ్చేది గోరంత.. వడ్డింపు కొండంత

కాటూరులో జరిగిన బాడుడే బాదుడులో  మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ 

  కాటూరు(ఉయ్యూరు), జూలై 1 : నవరత్నాలు పేరుతో గోరంత ఆశచూపి పన్నులు, చార్జీల రూపలంలో కొండంత పిండుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ  ఇన్‌చార్జి బోడెప్రసాద్‌ అన్నారు. గత మూడేళ్ల పాలనలో  జగన్‌ రెడ్డి ఓ చేత్తో ఇస్తూ పలు రకాలుగా  ధరలు, చార్జీల పెంపు, పన్నుల వడ్డింపు రూపంలో దోచుకుంటున్న వైనాన్ని సామాన్య ప్రజలకు వివరించి వారిలో చైతన్యం  తీసు కువచ్చేందుకు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం  కాటూరులో పర్యటించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ,  జే టాక్స్‌ వసూళ్ల మీద ఉన్నశ్రద్ధ స్థానిక ఎమ్మెల్యేకు, ముఖ్య మంత్రికి లేకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సభ్యు రాలు  సజ్జా అనూష, కుటుంబరావు,  తెలుగు యువత నాయకుడు దండమూడి చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

60 మంది టీడీపీలో చేరిక

  కాటూరులో సీనియర్‌ పార్టీ నాయకుడు గుర్రం చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో కాటూరు భాను, మోటుపల్లి మఽఽధుకర్‌, కాటూరు రత్నశేఖర్‌తో పాటు అధికార పార్టీకి చెందిన 60 మందికి పైగా నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అరాచక పాలనతో విసిగి పోయి టీడీపీలో చేరారన్నారు.  పార్టీ  మండల అధ్యక్షుడు కుటుంబరావు, వెంకటనారాయణ, వేమూరు శ్రీనివాసరావు, కాకాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొని పార్టీలోకి  వచ్చేవారిని ఆహ్వానించారు. 

Updated Date - 2022-07-02T06:37:17+05:30 IST