ED attached properties : నీరవ్ మోడీకి ED ఝలక్..
ABN , First Publish Date - 2022-07-23T01:42:28+05:30 IST
ఎగవేతదారు, పరారీలో ఉన్న నీరవ్ మోడీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ(Enforcement Directorate) అటాచ్ చేసింది.
న్యూఢిల్లీ : ఎగవేతదారు, పరారీలో ఉన్న నీరవ్ మోడీ(Nirav Modi)కి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ(Enforcement Directorate) అటాచ్(Attach) చేసింది. ఈ జాబితాలో చరాస్థులైన నగలు, బ్యాంకు బ్యాలెన్స్తోపాటు ఆస్తులు కూడా ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టాల(PMLA) కింద ఆస్తులను అటాచ్ చేసినట్టు అధికారులు తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 420, 467, 471, 120-బీ కింద చర్యలు తీసుకున్నామని వివరించారు.
కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank)కు రూ.14 వేల కోట్ల మోసం కేసులో నీరవ్ మోడీ ప్రస్తుతం యూకే(United Kingdom) జైలులో ఉన్నాడు. భారత్కు అప్పగింత ప్రక్రియ జాప్యమవుతున్న నేపథ్యంలో అక్కడి జైళ్లోనే గడుపుతున్నాడు. పీఎన్బీ మోసం కేసును సీబీఐ(CBI) దర్యాప్తు చేస్తుండగా.. మోసం కేసులో మనీల్యాండరింగ్ కింద ఈడీ (ED) దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే.