చైనీయులకు వీసాల్లో అక్రమాలు

ABN , First Publish Date - 2022-05-26T13:25:17+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసింది.

చైనీయులకు వీసాల్లో అక్రమాలు

కార్తీ చిదంబరంపై మనీలాండరింగ్‌ కేసు

న్యూఢిల్లీ, మే 25: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసింది. చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు పంజాబ్‌లో పవర్‌ ప్లాంటు నిర్మిస్తున్న వేదాంత గ్రూపు కంపెనీ తల్వాండి సాబో పవర్‌ లిమిటెడ్‌ (టీఎ్‌సపీఎల్‌)లో పనిచేసేందుకు 263 మంది చైనీయులకు వీసా మంజూరు చేసేందుకు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. సీబీఐ ఇప్పటికే కార్తీ, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. దాని ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కూడా కేసు పెట్టినట్లు సదరు సంస్థ వర్గాలు బుధవారం వెల్లడించాయి. 

Updated Date - 2022-05-26T13:25:17+05:30 IST