రాహుల్‌కు మరోసారి సమన్లు.. నాలుగో రోజూ విచారణ

ABN , First Publish Date - 2022-06-16T03:28:48+05:30 IST

నేషనల్ హెరాల్డ్‌ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై మూడు రోజులుగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈడీ బుధవారం సమన్లు ఇచ్చింది. ఇప్పటికే మూడు రోజులపాటు రాహుల్‌ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ తాజా నోటీసులతో నాలుగో రోజు విచారించనుంది. రోజు పది గంటల చొప్పున

రాహుల్‌కు మరోసారి సమన్లు.. నాలుగో రోజూ విచారణ

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్‌ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై మూడు రోజులుగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈడీ బుధవారం సమన్లు ఇచ్చింది. ఇప్పటికే మూడు రోజులపాటు రాహుల్‌ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ తాజా నోటీసులతో నాలుగో రోజు విచారించనుంది. రోజు పది గంటల చొప్పున రాహుల్ ఈడీ కార్యాలయంలోనే ఉంటున్నారు. ఇక బుధవారం రోజున ఇప్పటితో ముగుస్తుందని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో గురువారం విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపడం గమనార్హం. ఒకవైపు రాహుల్‌ను ఈడీ విచారిస్తుంటే మరొకవైపు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లు, నిర్భందాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.

Updated Date - 2022-06-16T03:28:48+05:30 IST