శ్రీరామనవమికి ఎడ్లబండ్ల పోటీలు
ABN , First Publish Date - 2021-04-18T06:25:29+05:30 IST
మండలంలోని కరావులపల్లి తాండా వద్దగల అభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 21న జిల్లాస్థాయి, ఎడ్లబండ్ల పరుగు పందాలు నిర్వహిస్తున్నట్లు బంజారా సేవా సంఘం నాయకులు రంగానాయక్, పాలేజయరాంనాయక్, లాయర్ తిప్పేనాయక్, తెలిపారు.
గోరంట్ల, ఏప్రిల్ 17: మండలంలోని కరావులపల్లి తాండా వద్దగల అభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 21న జిల్లాస్థాయి, ఎడ్లబండ్ల పరుగు పందాలు నిర్వహిస్తున్నట్లు బంజారా సేవా సంఘం నాయకులు రంగానాయక్, పాలేజయరాంనాయక్, లాయర్ తిప్పేనాయక్, తెలిపారు. ఆలయ వ్యవస్థాపకులు సునీత, శంకర్నాయక్ ఆధ్వర్యంలో ప్రతియేటా శ్రీరామనవమికి పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. శ్రీరామ కళ్యాణోత్సవం అనంతరం ఆలయం వద్ద ఎడ్లబండ్ల పోటీలను మధ్యాహ్నం 12గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితియ,తృతియ, నాలుగోస్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు, రూ.40వేలు, రూ.30వేలు రూ.20వేలు నగదు బహముతులు అందజేస్తారు. ఎడ్లబండ్ల పోటీలలో రూ.200డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చన్నారు. ఇతర సమాచారం కోసం సెల్ 9441765766ను సంప్రదించాలన్నారు.