‘విద్యా దీవెన’ పేద విద్యార్థులకు వరం

ABN , First Publish Date - 2021-04-20T04:31:52+05:30 IST

విద్యాదీవెన పథకం పేద విద్యార్థులకు వరమని కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ అన్నారు.

‘విద్యా దీవెన’ పేద విద్యార్థులకు వరం
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌, ఎంపీ తదితరులు

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 19: విద్యాదీవెన పథకం పేద విద్యార్థులకు వరమని కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ అన్నారు. సోమవారం విద్యాదీవెన పథకాన్ని సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. విజయనగరంలో వైఎస్సార్‌ కాలనీకి చెందిన కొమ్మూరు రాజ్యలక్ష్మితో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడారు. పథకం తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లా డుతూ పథకం ద్వారా  జిల్లాలోని 57,238 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరి నట్టు తెలిపారు. ఇందులో 44,139 మంది బీసీ,  5,304 మంది ఎస్సీ, 3,551 మంది ఎస్టీ, 2,995 మంది ఈబీసీలు,  914 మంది కాపు, 294 మంది మైనార్టీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జేసీ మహేష్‌ కుమార్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్‌ రాజకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-20T04:31:52+05:30 IST