విద్యాకానుక కిట్లు జూలై 5 నుంచి పంపిణీ
ABN , First Publish Date - 2022-06-30T15:26:59+05:30 IST
పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని సమగ్ర శిక్ష జిల్లాల విద్యాశాఖ అధికారులకు
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని సమగ్ర శిక్ష జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 30 వరకు పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. రోజుకు 30 నుంచి 40 కిట్లు బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేయాలని ఆదేశించింది. కిట్ల నాణ్యతను ముందుగానే సరిచూసుకోవాలని, పాడైన, చిరిగిపోయిన కిట్లు అందితే ఆ వివరాలను పై అధికారులకు తెలపాలని పేర్కొంది.