ఈ బాదుడేంది.. సారూ!
ABN , First Publish Date - 2021-12-28T03:22:32+05:30 IST
ఒమైక్రాన్ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులు, ఆ పని మాని మాస్కులు ధరించలేదనే కారణంతో జరిమానాలు వసూలు చేయడం ఏమిటని వెంకటగిరి పట్టణవాసులు విమర్శిస్తున్నారు.
మాస్కుల సాకుతో పోలీసుల దందా..
బెంబేలెత్తుతున్న వాహనదారులు
వెంకటగిరి, డిసెంబరు 28 : ఒమైక్రాన్ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులు, ఆ పని మాని మాస్కులు ధరించలేదనే కారణంతో జరిమానాలు వసూలు చేయడం ఏమిటని వెంకటగిరి పట్టణవాసులు విమర్శిస్తున్నారు. రోడ్డు కూడళ్లలో వాహనాలను ఆపి జరిమానా విధించడం నిత్యకృత్యమైపోయింది. గతంలో వారంలో ఒకటి రెండు రోజుల మాత్రమే వాహనాల తనిఖీ నిర్వహించే పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్, రికార్డులు, హెల్మెట్ వంటి వివరాల తనిఖీ తర్వాత, మాస్క్ ధారణపై అవగా హన కల్పించేవారు. ప్రస్తుతం ఎలాంటి అవగాహన కల్పించకుండానే ఫైన్ వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పలువురు అధికారులు సైతం మాస్కులు లేకుండానే విధులకు హాజరు అవుతున్న పరిస్థితుల్లో తమపై మాత్రం ఈ దాష్టీకం ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల్లో తూచ్..!
పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒమైక్రాన్ వైరస్పై సరైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్లే నిబంధనలను విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది.