ఆ గవర్నర్‌పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఈటల

ABN , First Publish Date - 2022-04-11T19:54:33+05:30 IST

మహిళా గవర్నర్‌ తమిళి సై పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

ఆ గవర్నర్‌పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఈటల

హైదరాబాద్: మహిళా గవర్నర్‌ తమిళి సై పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ జరిపిన సైకో కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ధాన్యం‌ కొనకుంటే కేసీఆర్‌ గద్దె దిగిపోవాలని సవాల్ విసిరారు. పాలన వదిలేసి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారో కేసీఆర్‌ చెప్పాలి? అని నిలదీశారు. దేశంలో ఎక్కడాలేని సమస్య.. రాష్ట్రంలోనే ఎందుకు? వచ్చిందని ప్రశ్నించారు.  రైతుల పంటను కొనలేని అసమర్థుడు కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణలో పీకే ప్లాన్‌లు పనిచేయవని చెప్పారు. తెలంగాణ గడ్డపై సీఎం కేసీఆర్‌కు ముఖం చెల్లడంలేదన్నారు. పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఈటల రాజేందర్ అన్నారు.

Updated Date - 2022-04-11T19:54:33+05:30 IST