ఎమ్మెల్యే రమేష్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-10-03T05:43:02+05:30 IST

ఎమ్మెల్యే రమేష్‌ దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్యే రమేష్‌ దిష్టిబొమ్మ దహనం

 భూపాలపల్లిటౌన్‌, అక్టోబరు 2: వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్‌పీ జిల్లా ఇన్‌చార్జి అంబాల చంద్రమౌళి మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వారసత్వ ఆస్తికి సంబంధించి ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అనుచరులు అక్రమంగా ధరణిలో మార్పిడి చేశారని ఆరోపిం చారు. రాష్ట్రంలో ఇదో రకం మాఫియా కొనసాగుతోందన్నారు.   ఎమ్మెల్యే రమేష్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించాని సీఎం కేీసీఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పీ జిల్లా కన్వీనర్‌ రాజన్న, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ విజయ్‌, కోఆర్డినేటర్‌ బాపు, నాయకులు శ్రీనివాస్‌, కొంరయ్య, బిక్షపతి, సురేష్‌, తిరుపతి, చంటి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-03T05:43:02+05:30 IST