రామగుండం సర్వతోముఖాభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2022-05-22T05:50:58+05:30 IST
రామగుండం కార్పొరేషన్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
- ఎమ్మెల్యే కోరుకంటి చందర్
జ్యోతినగర్, మే 21: రామగుండం కార్పొరేషన్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం న్యూపోరట్పల్లిలో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. వివిధ పథకాల ద్వారా వచ్చిన డబ్బుతోపాటు ప్రత్యేక నిధులతో కార్పొరేషన్లోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని, అన్నిరకాల మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఇప్పటికే ఆయా డివిజన్లలో అభివృద్ధి పనులు మొదలు పెట్టామని, మిగిలిన అన్ని పనులను రానున్న కొన్ని నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మూడో డివిజన్ పరిధిలోని న్యూపోరట్పల్లిలో ప్రతీ వర్షాకాలంలో ఎన్టీపీసీ కాలువ పొంగి కాలనీలోని ఇళ్లన్నీ జలమయం అవుతున్నాయని, ఆ సమస్యను శాశ్వతంగా దూరం చేయడానికి కొత్తగా 30 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో ఓపెన్ డ్రైనేజీని నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. 30 లక్షల రూపాయలతో డ్రైనేజీతోపాటు ఐదు లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే చందర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లు డాక్టర్ అనిల్కుమార్, నడిపెల్లి అభిషేక్రావు, టీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు చెప్యాల రామారావు. నాయకులు బుర్ర శంకర్గౌడ్, ఈదునూరి శంకర్, ఒల్లాల మల్లేశం, అనిల్రావు, వీరాలాల్, గోసిక శ్రీనివాస్, మంతెన శ్రీకాంత్, గోలివాడ చంద్రకళ, ప్రసన్న, శంకర్, దేవేందర్, ఎస్.శంకర్, కాలనీవాసులు పాల్గొన్నారు.