బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి
ABN , First Publish Date - 2022-05-19T05:01:38+05:30 IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సంజయ్కుమార్ అన్నారు.
- టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సంజయ్కుమార్
మందమర్రిటౌన్, మే 18: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సంజయ్కుమార్ అన్నారు. మందమర్రి ప్రెస్క్లబ్ వద్ద బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారున. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ అని తెలిపారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు మినీమహానాడులు పార్టీ నిర్వహిస్తుందన్నారు. పార్టీ ఆధ్వర్యంలో రామకృష్ణపూర్లో తలపెట్టిన మినీ మహానాడును విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లును పూర్తి చేశామని, నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సమావే శంలో జక్కుల సమ్మయ్య, శ్రీనివాస్, సలీం, అనంతలక్ష్మీ, సమ్మక్క, రంఘనాద్, రాజేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.