ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2021-02-26T04:20:21+05:30 IST
మక్తల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠ శాలల అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు.
మక్తల్, ఫిబ్రవరి 25 : మక్తల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠ శాలల అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు. గురు వారం మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు రూ.60వేల విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్, జిరాక్సు, స్కానర్ లను అందజేశారు. నియోజక వర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.50లక్షలతో ప్రత్యే క ప్యాకేజీ ఏర్పాటు చేశానన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు రంగులు, ఫర్నిచర్, కంప్యూటర్లు సమకూర్చడంతోపాటు టాయిలెట్స్ నిర్మాణా నికి ఈ నిధులను ఖర్చుచేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకోసం ఫీజులు చెల్లిస్తానన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వెంకటవర లక్ష్మి, వర్కటం జగన్నాథ్రెడ్డి సతీమణి వర్కటం అంజనారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.