తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-05-21T05:11:02+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి కృషి
వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సదాశివపేట రూరల్‌, మే 20: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి విగ్రహప్రతిష్ఠాపన ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌ బాలమణి, ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకన్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:11:02+05:30 IST