దేవాలయాల అభివృద్ధికి కృషి: ఎంపీ
ABN , First Publish Date - 2022-07-02T06:49:40+05:30 IST
: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం అరర్వపల్లి మండలం కోడూరు గ్రామంలో శంభులింగేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి హంపీ పీఠాఽ దిపతి విరూపాక్ష విద్యారణ్యభారతితో కలిసి భూమిపూజ చేశారు
అర్వపల్లి, జూలై 1: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం అరర్వపల్లి మండలం కోడూరు గ్రామంలో శంభులింగేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి హంపీ పీఠాఽ దిపతి విరూపాక్ష విద్యారణ్యభారతితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరుచేశానన్నారు. దేవాలయ నిర్మాణానికి రూ.6 లక్షలు విరాళం ప్రకటించారు. బ్రిడ్జి లేనందున వర్షం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సామ అభిషేక్రెడ్డి, రవీందర్రెడ్డి, సర్పంచ్ గుయ్యనిబాబు, వెంకట్రెడ్డి, బ్రహ్మాచారి, పాపయ్యగౌడ్, సుధీర్రెడ్డి, వల్లపు సోమయ్య, వెంకన్న, మల్లయ్య, రషీద్ పాల్గొన్నారు.