సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2022-05-11T07:23:25+05:30 IST
నిర్మల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు అభి వృద్ధి చెందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని జడ్పీ చైర్పర్సన్ కె.విజయలక్ష్మి సూచించారు.
నిర్మల్ కల్చరల్, మే 10 : నిర్మల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు అభి వృద్ధి చెందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని జడ్పీ చైర్పర్సన్ కె.విజయలక్ష్మి సూచించారు. మంగ ళవారం నిర్మల్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో విజయలక్ష్మి అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గౌరవ జడ్పీ సభ్యులకు అభివృద్ధి విషయంలో దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ఇతోధికంగా ప్రాధాన్య మిచ్చి నిధులు మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు అధికారులతో కలిసి ప్రణాళికాబ్ధంగా వ్యవహ రించాలన్నారు. లక్ష్మణచాంద జడ్పీటీసీ ఓస రాజేశ్వర్ మాట్లాడుతూ... డ్వాక్రా గ్రూపులకు వడ్డీ సకాలంలో చెల్లించేలా చూడాలని కోరారు. వ్యవసాయ స్థాయి సంఘ సమావేశానికి నర్సాపూర్ జడ్పీటీసీ సభ్యుడు అర్గుమీది రామయ్య అధ్యక్షతన ధాన్యం కొనుగోలు తదితర అంశాలు చర్చించారు. జడ్పీటీసీ సభ్యులు గంగమణి (కుంటాల) పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి (సారంగాపూర్), జడ్పీ సీఈవో సుధీర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవ సాయ అధికారి అంజిప్రసాద్, పశు సంవర్ధశాఖ అధికారి రమేష్ కుమార్, పరిశ్రమల శాఖ అధికారి నరసింహరెడ్డి, ఎఫ్ఆర్వో జైపాల్రెడ్డి, మార్కె టింగ్ అధికారి అశ్వక్, ఆర్టీసీ డీఎం సాయన్న పాల్గొన్నారు.