త్రిలింగ రామేశ్వరాలయాభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-01-16T05:33:03+05:30 IST

మండలంలోని త్రిలింగ రామేశ్వరాలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు.

త్రిలింగ రామేశ్వరాలయాభివృద్ధికి కృషి
త్రిలింగ రామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న ఎమ్మెల్యే

నాగిరెడ్డి పేట, జనవరి 15: మండలంలోని త్రిలింగ రామేశ్వరాలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. ఆయన శుక్రవారం త్రిలింగ రామేశ్వరాలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. కాకతీయుల కాలంలో నిర్మించారని, ఆలయ చరిత్రను వెలికి తీసి ఆలయ ప్రాముఖ్యతను రాష్ట్ర నలుమూలల తెలిసేలా చేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక క్రేంంగా మార్చడానికి కృషి చేస్తానన్నారు. ఏడుపాలయ దుర్గమ్మ, పోచారం ప్రాజెక్టు, త్రిలింగ రామేశ్వరాలయంలను కలిపి పర్యాటకులు సందర్శనకు వచ్చేలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ధుతానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మనోహర్‌ రెడ్డి, ఎంపీపీ రాజ్‌దాస్‌, తాండూర్‌ సర్పంచ్‌ గంగామణి, వెంకంపల్లి సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి, నాయకులు బోయిని విఠల్‌, దత్తు, సంజీవులు, తదితరులు పాల్గొన్నా

Updated Date - 2021-01-16T05:33:03+05:30 IST