వరదరాజుల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-08-09T11:37:10+05:30 IST

మండల పరిధిలోని పెద్దదుద్యాలలో వెలసిన వరద రాజుల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆలయ నూతన మండలి అధ్యక్షు డు గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నా రు.

వరదరాజుల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

వరదరాజుల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

ముద్దనూరు ఆగస్టు 8:  మండల పరిధిలోని పెద్దదుద్యాలలో వెలసిన వరద రాజుల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆలయ నూతన మండలి  అధ్యక్షు డు గోవర్థన్‌రెడ్డి  పేర్కొన్నా రు. నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులతో శనివారం  దేవాదాయశాఖ ఈవో రమణారెడ్డి నూతన మండలి ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో  పాలక మండలి అధ్యక్షుడిగా గోవర్థన్‌రెడ్డి  సభ్యులతో కలిసి  ప్రమాణ స్వీకా రం చేశారు.


మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి మండలి అధ్యక్షుడు, సభ్యులకు శాలువ కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీటీసీ వరదారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T11:37:10+05:30 IST