గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-27T05:28:06+05:30 IST

గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎంవోటీ జే అంజిరెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలి
శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న అంజిరెడ్డి


పెద్ద దోర్నాల, అక్ట్టోబరు 26 : గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎంవోటీ జే అంజిరెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవ రణలో నూతనంగా ఎన్నికయిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు మంగళవారం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈవోఆర్‌డీ జిల్లెల రామిరెడ్డి అధ్యక్షతన  జరిగిన ఈ తరగతుల్లో ఎంవోటీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు మీపై నమ్మకంతో గెలిపించారని, వారికి సేవ చే యాల్సిన బాధ్యత ఉందన్నారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల విధి విధానాలు తెలిసి వుండాలన్నారు.  సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి చొరవ చూపాలని ఆ యన సూచించారు. జనన, మరణ ధ్రువపత్రాలు, ఇంటి పన్ను, ప్లాన్‌ అప్రూవల్‌, నివాస ధ్రువీకరణపత్రాల జారీ విషయంలో వేగవంతమైన సేవలందించాలని అంజిరెడ్డి తెలిపారు.  కార్యక్రమంలో పీసీహెచ్‌ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T05:28:06+05:30 IST