మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు కృషి
ABN , First Publish Date - 2021-01-16T06:36:43+05:30 IST
బతుకు దెరువు నిమిత్తం దుబాయి వెళ్లి ప్రమాదంలో మరణించిన ధర్మారావుపేటకు చెందిన గాండ్ల రాజశేఖర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు అన్ని విధాలా కృషిచేస్తామని గల్ఫ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి తెలిపారు.
గల్ఫ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి
సదాశివనగర్, జనవరి 15: బతుకు దెరువు నిమిత్తం దుబాయి వెళ్లి ప్రమాదంలో మరణించిన ధర్మారావుపేటకు చెందిన గాండ్ల రాజశేఖర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు అన్ని విధాలా కృషిచేస్తామని గల్ఫ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి తెలిపారు. రాజశేఖర్ కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. పరామర్శించినవారిలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోహినొద్దీన్, మాజీ ఎంపీటీసీ మల్లేష్, సంతోష్రెడ్డి, నవీన్రావు, రవీందర్రెడ్డి, జనార్ధన్రెడ్డి తదితరులున్నారు.