యానాదుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-05-26T06:20:57+05:30 IST

మండలంలోని జెపుల్లలచెరువు గ్రామసమీపాన చెంచుగూడెంలో నివసిస్తున్న యానాదుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి అన్నారు.

యానాదుల సమస్యల పరిష్కారానికి కృషి
సమస్యలు తెలుసుకుంటున్న ఆర్డీవో

రాచర్ల, మే 25 : మండలంలోని జెపుల్లలచెరువు గ్రామసమీపాన చెంచుగూడెంలో నివసిస్తున్న యానాదుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి అన్నారు. బుధవారం చెంచుగూడెం, చోళ్లవీడు గ్రామాలలో పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ చెంచుగూడెంలో నివసిస్తున్న యానాదుల కు భూములు ఇచ్చే విషయంలో నిబంధనలు పాటించడం జరుగుతుందన్నారు. చెంచుగూడెంలో ఉన్న భూములన్నింటికీ సర్వే చేయిస్తా మ న్నారు. నిబంధనల ప్రకారం వారికి న్యాయం జరుగుతుందన్నారు. చోళ్లవీ డు గ్రామంలో గ్రామకంఠం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహ సీల్దార్‌ భారతీభాయి, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T06:20:57+05:30 IST