ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2020-12-03T05:51:40+05:30 IST

రాయికోడ్‌, డిసెంబరు 2 : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఉపాధ్యాయులకు సభ్యత్వం అందజేస్తున్న పీఆర్టీయూ నాయకులు

రాయికోడ్‌, డిసెంబరు 2 : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. బుధవారం మండల కేంద్రమైన రాయికోడ్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకు పీఆర్టీయూ సభ్వత్యాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ ముందుండి పోరాటాలు చేస్తున్నదని పేర్కొన్నారు. త్వరలోనే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్‌చౌహాన్‌, పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు డీ.విఠల్‌, శంకర్‌, నాయకులు తులసీరాంరాథోడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T05:51:40+05:30 IST