తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-01-26T04:52:19+05:30 IST

మం డలంలోని జి.అగ్రహారంలో నెలకొ న్న తీవ్రమైన నీటిఎద్దడిని అధిక మించేందుకు చర్యలు తీసుకుం టున్నట్లు ఎంపీపీ వాకా వెంకట రెడ్డి తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
అగ్రహారంలో డీప్‌ బోరుని పరిశీలిస్తున్న వెంకటరెడ్డి

ఎంపీపీ వెంకటరెడ్డి

మర్రిపూడి, జనవరి 25: మం డలంలోని జి.అగ్రహారంలో నెలకొ న్న తీవ్రమైన నీటిఎద్దడిని అధిక మించేందుకు చర్యలు తీసుకుం టున్నట్లు ఎంపీపీ వాకా వెంకట రెడ్డి తెలిపారు. మంగళవారం గ్రామంలో పర్యటించి నీటి వన రులను పరిశీలించారు. గ్రామం లో భూగర్భ జలాలు అందుబా టులో లేకపోవడంతో పలు బోర్లు వట్టిపోయాయి. దీంతో వాడుక నీటి కోసం ఎస్సీ కాలనీవాసులు మైళ్ల దూరం వెళ్లి వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుంది. కాలనీకి తూర్పు వైపున ఉన్న వాగు సమీపంలో డీప్‌ బోరు వేసేందుకు అనువైన స్ధలాన్ని ఎంపీపీ పరిశీలించారు. 

మండల పరిషత్‌ నిధులతో రెండు మూడు రోజుల్లో డీప్‌ బోరువేసి ప్రత్యేక పైప్‌లైన్‌ ఏర్పాటుద్వారా కాలనీకి నీరంది స్తామని వెంటరెడ్డి చెప్పారు. ఆయన వెంట ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ నాయబ్‌ ర సూల్‌, నాయకులు మాచేపల్లి నాగయ్య, చెరుకూరి శ్రీనివాసులు, కందిమళ్ల రామ య్య, మర్రిపూడి ఎంపీటీసీ ఉప్పుతోళ్ల చిరంజీవి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-26T04:52:19+05:30 IST