Biharలో చెరువులో పడిన కారు...8మంది మృతి

ABN , First Publish Date - 2022-06-11T17:02:42+05:30 IST

బీహార్ రాష్ట్రంలో శనివారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

Biharలో చెరువులో పడిన కారు...8మంది మృతి

పాట్నా(బీహార్) : బీహార్ రాష్ట్రంలో శనివారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు చెరువులో పడిపోవడంతో 8 మంది మరణించిన ప్రమాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పూర్నియాలో శుక్రవారం అర్దరాత్రి జరిగింది.10 మంది ప్రయాణిస్తున్న కారు వేగంగా వస్తుండగా అదుపు తప్పి చెరువు నీటిలో పడిపోయింది. కారు తారాబడి నుంచి కిషన్ గంజ్‌కు వెళుతుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. చెరువులో నుంచి 8 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కారులో నుంచి ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా రక్షించారు.

Updated Date - 2022-06-11T17:02:42+05:30 IST